అంచనాలను మించిపోయిన కోటక్ మహీంద్రా లాభం

by Disha Web Desk 17 |
అంచనాలను మించిపోయిన కోటక్ మహీంద్రా లాభం
X

ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ శనివారం తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొదటి త్రైమాసికానికి బ్యాంక్ లాభం 67 శాతం పెరిగి రూ.3,452.30 కోట్లకు చేరుకుంది. ఇది మార్కెట్ వర్గాలు అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువ. ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో స్టాండలోన్, కన్సాలిడేటెడ్ ఫలితాలను ఆమోదించారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.2,071 కోట్లుగా ఉంది. సమీక్ష త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ. 6,234 కోట్లుగా ఉంది. జూన్ త్రైమాసికంలో అడ్వాన్సులు 19 శాతం పెరిగి రూ. 3,37,031 కోట్లకు చేరుకున్నాయి. బ్యాంక్ ప్రస్తుత డిపాజిట్లు ఏప్రిల్ నుండి జూన్ 2023 త్రైమాసికంలో రూ. 59,431 కోట్లకు పెరిగాయి. జూన్ 30 నాటికి సగటు పొదుపు డిపాజిట్లు రూ. 1,19,817 కోట్లుగా ఉన్నాయి.



Next Story