- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WFH: ఐటీ రంగంలో మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ టాక్
ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో సాధ్యమైన ఉద్యోగాలకు తాత్కాలికంగా తప్పనిసరి వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని మంత్రి మాన్సుఖ్ మాండవియాను కోరింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంధన వినియోగాన్ని తగ్గించి, సాధ్యమైనంత వరకు రిమోట్ వర్క్ను ప్రోత్సహించాలని సూచించడంతో భారత కార్పొరేట్ రంగంలో మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగుల సంఘం నైట్స్ (నైట్స్) కేంద్ర కార్మిక శాఖకు లేఖ రాసింది. ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో సాధ్యమైన ఉద్యోగాలకు తాత్కాలికంగా తప్పనిసరి వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని మంత్రి మాన్సుఖ్ మాండవియాను కోరింది. కోవిడ్ సమయంలో భారత ఐటీ రంగం రిమోట్ వర్క్ మోడల్ను విజయవంతంగా అమలు చేసిందని నైట్స్ అధ్యక్షుడు హర్ప్రీత్ సింగ్ సలూజా అన్నారు. క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ కొలాబరేషన్ టూల్స్ సహాయంతో కంపెనీలు కార్యకలాపాలను సజావుగా కొనసాగించాయి. మెట్రో నగరాల్లో ఉద్యోగుల రోజువారీ ప్రయాణాల వల్ల ఇంధన వినియోగం, ట్రాఫిక్, కాలుష్యం, మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయని, అవసరం లేని ప్రయాణాలను తగ్గించడం దేశ ప్రయోజనానికి ఉపయోగపడుతుందని నైట్స్ అభిప్రాయపడింది. అయితే, పరిశ్రమ వర్గాలు మాత్రం పూర్తిస్థాయి వర్క్ ఫ్రమ్ హోమ్కు తిరిగి వెళ్లడం కష్టమని చెబుతున్నాయి. కోవిడ్ తర్వాత చాలా ఐటీ సంస్థలు హైబ్రిడ్ మోడల్కు మారాయి. ప్రస్తుతం టీసీఎస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని అనుసరిస్తుండగా, కాగ్నిజెంట్ మూడు రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ను కొనసాగిస్తోంది. ఇన్ఫోసిస్ కూడా పరిమితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇస్తోంది. సంస్థలు అవసరాన్ని బట్టి హైబ్రిడ్, రిమోట్ విధానాలను అమలు చేసే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, సాధ్యమైనంత వరకు హైబ్రిడ్ మోడల్కే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని నాస్కామ్ పేర్కొంది.






