- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GST 2.0: అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0.. రేట్లు తగ్గినవి ఇవే
కొత్త విధానంతో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) శ్లాబుల సంఖ్య రెండింటికి చేరాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జీఎస్టీ 2.0లో మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్నురేట్లు సోమవారం నుంచి తగ్గాయి. ఈ సంస్కరణలతో వస్తు, సేవల పన్ను తగ్గడమే కాకుండా అనేక రకాల వ్యాపారాల నిర్వహణలో కూడా సులభ, సౌకర్యవంతమైన చర్యలు అమలులోకి వచ్చాయి. కొత్త విధానంతో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) శ్లాబుల సంఖ్య రెండింటికి చేరాయి. దీంతో సబ్బులు, హెయిర్ ఆయిల్, షాంపూలు వంటి రోజువారీ నిత్యావసరాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు వంటి వస్తువులు చౌకగా మారాయి.
చౌకగా లభించేవి
రోజువారీ నిత్యావసరాలు: గతంలో 12 శాతం జీఎస్టీ పరిధిలో ఉన్న ఉత్పత్తులు ఇప్పుడు 5 శాతం శ్లాబ్ లేదా జీరో టాక్స్ శ్లాబుకి పడిపోయాయి. ఇందులో టూత్పేస్ట్, సబ్బులు, షాంపూలు, బిస్కెట్లు, స్నాక్స్, జ్యూస్లు వంటి ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, నెయ్యి, కండెన్స్డ్ మిల్క్ వంటి పాల ఉత్పత్తులు, సైకిళ్ళు, స్టేషనరీ, తక్కువ ధరల దుస్తులు, పాదరక్షలు ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలకు ఈ కోత చాలా ప్రయోజనం కలిగిస్తుంది.
గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్: 28 శాతం బ్రాకెట్లోని చాలా వస్తువులు ఇప్పుడు 18 శాతానికి మారాయి. ఫలితంగా ఈ విభాగంలో ధరలు 7-8 శాతం తగ్గాయి. ఈ జాబితాలో ఎయిర్ కండిషనర్లు, డిష్వాషర్లు, పెద్ద స్క్రీన్ టెలివిజన్లు, సిమెంట్ (నిర్మాణం, గృహనిర్మాణానికి కీలకమైన ఇన్పుట్) కూడా ఉన్నాయి. ఈ విభాగంలో రేటు తగ్గింపు డిమాండ్ను పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా పట్టణ మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం.
ఆటోమొబైల్స్: చిన్న కార్లు (1,200చ్చ్ వరకు ఇంజిన్ సామర్థ్యం), ద్విచక్ర వాహనాలు 28 శాతం నుంచి 18 శాతానికి మారడంతో ఆటో రంగం లాభపడనుంది. అయితే, పెద్ద కార్లు, ఎస్యూవీలు 40 శాతం పరిధిలోకి వెళ్లాయి. అయితే సెస్ (గతంలో ఇది 17-22 శాతం ఉండేది) తొలగించడం భారీ ఉపశమనం కల్పించింది. తద్వారా ఈ ప్రీమియం వాహనాలపై ధరలు కూడా తగ్గాయి.
బీమా, ఆర్థిక సేవలు: ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ ఉన్న బీమా ప్రీమియంలను పూర్తిగా మినహాయించారు. దీనివల్ల దేశంలో చాలామంది బీమా సౌకర్యం పొందే వీలుంటుంది. ఆరోగ్య, జీవిత బీమా కవరేజీ పెరగడం వల్ల ఆర్థిక భద్రతను పెంచుతుంది.
మరింత సులభంగా వ్యాపారాలు
జీఎస్టీ 2.0తో జీఎస్టీ శ్లాబుల సంఖ్య తగ్గడం వల్ల అనేక రకాల వస్తువుల ధరలు తగ్గడమే కాకుండా దేశంలో అనేక రకాల వ్యాపారాలు మరింత సులభంగా జరగనున్నాయి. అవేంటంటే..
ఎగుమతిదారులు/సెజ్లకు తాత్కాలిక రీఫండ్లు: నవంబర్ 1 నుంచి ఆటోమెటిక్ సిస్టమ్ ద్వారా రిస్క్ చెక్ ఆధారంగా 90 శాతం వాపసు మొత్తం త్వరగా రీఫండ్లు జరుగుతాయి.
ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కోసం రీఫండ్లు: పైన చెప్పిన విధంగానే నవంబర్ 1 నుంచి ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ (ఐడీఎస్) కింద వాపసు కోరే వ్యక్తులు (ఇన్పుట్లపై పన్ను అవుట్పుట్లపై పన్ను కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది) కూడా 90 శాతం మొత్తం ముందుగానే రీఫండ్ పొందుతారు.
తక్కువ-విలువ ఎగుమతులు: పన్ను చెల్లించిన ఎగుమతులపై జీఎస్టీ రీఫండ్ల పరిమితి రద్దు చేశారు. దీని వలన కొరియర్ లేదా పోస్ట్ ద్వారా వస్తువులను పంపే చిన్న ఎగుమతిదారులకు ప్రయోజనం లభిస్తుంది.
చిన్న వ్యాపారాలకు సరళీకృత రిజిస్ట్రేషన్: నెలవారీ జీఎస్టీ రూ. 2.5 లక్షల వరకు చెల్లించే తక్కువ-రిస్క్ దరఖాస్తుదారులకు మూడు పని దినాలలో ఆటోమేటెడ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. దీనివల్ల నవంబర్ 1 నుంచి దాదాపు 96 శాతం మంది కొత్త దరఖాస్తుదారులు దీని కింద కవర్ అవుతారు.
ఈ-కామర్స్ సరఫరాదారులకు రిజిస్ట్రేషన్ ఉపశమనం: ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో చిన్న విక్రేతల కోసం ఒకే సరళీకృత విధానం తీసుకురానున్నారు. దీనివల్ల వారికి రకరకాల రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకునే బెడద తప్పుతుంది.






