- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2,500 మోసపూరిత లోన్ యాప్ల తొలగింపు
న్యూఢిల్లీ: 2021, ఏప్రిల్ నుంచి 2022, జూలై మధ్య గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి 2,500 మోసపూరిత లోన్ యాప్లను రద్దు లేదా తొలగించిందని ప్రభుత్వం వెల్లడించింది. మోసపూరిత లోన్ యాప్ల కట్టడికి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ), ఇతర నియంత్రణ సంస్థలతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. సమాజంలో సైబర్ సెక్యూరిటీని పెంచడం, అటువంటి మోసాలను తగ్గించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. మోసపూరిత లోన్ యాప్లను నియంత్రించేందుకు ఆర్బీఐ చట్టపరమైన అనుమతి ఉన్న లోన్ యాప్ల వివరాలను ప్రభుత్వానికి అందజేసిందని, దీన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్తో పంచుకుందని, తద్వారా మోసపూరితమైన వాటిని కట్టడి చేసినట్టు నిర్మలా సీతారామన్ వివరించారు. గూగుల్ ప్లే స్టోర్ సైతం తన పాలసీ విధానాలను అప్డేట్ చేసిందని, దేసీయ లోన్ యాప్ల కోసం కఠినమైన చర్యలతో అదనపు పాలసీ వివరాలను అమలు చేస్తోందని వెల్లడించారు.