- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. రెండోరోజూ భారీగా పెరిగిన వైనం
బంగారం, వెండి ధరలు మళ్లీ ఊహించని షాకులిస్తున్నాయి. వరుసగా రెండోరోజు వీటి ధరలు భారీగా పెరిగాయి.

దిశ, వెబ్డెస్క్: బంగారం, వెండి ధరలు మళ్లీ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. వరుసగా రెండో రోజు ఈ లోహాల ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఉదయం 10 గంటలకు లైవ్ ట్రేడింగ్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1420 పెరిగి.. రూ.1,55,350కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1300 పెరిగి.. రూ.1,42,400 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ.10,000 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,75,000గా ఉంది. పెరిగిన ధరలపై జీఎస్టీ, తరుగు అదనంగా ఉండనున్నాయి. కాగా.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులుండొచ్చు. జూన్ వరకూ ఓ వైపు పెళ్లిళ్లు, మరోవైపు ఇతర శుభకార్యాలున్న వేళ.. బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి పెరిగిన ధరలు భారమవుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి వారిలో బంగారం మళ్లీ అందని ద్రాక్షవుతుందా అన్న ఆందోళన మొదలైంది.






