రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉంటే ఈ-ఇన్‌వాయిస్ తప్పనిసరి!

by Disha Web Desk 17 |
రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉంటే ఈ-ఇన్‌వాయిస్ తప్పనిసరి!
X

న్యూఢిల్లీ: జీఎస్టీ నిబంధనలకు సంబంధించి కేంద్రం కీలక మార్పులు చేసింది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్థలు ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి బిజినెస్-టూ-బిజినెస్(బీ2బీ) లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ లేదా ఈ-ఇన్‌వాయిస్‌ని రూపొందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ. 10 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న సంస్థలకు ఈ నిబంధన అమల్లో ఉంది. కేంద్రం ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ద్వారా ఈ-ఇన్‌వాయిస్ నమోదు పరిమితిని తగ్గింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ-ఇన్‌వాయిస్‌ల కిందకు వచ్చే ఎంఎస్ఎంఈ సంస్థల పరిది విస్తరించబడుతుందని డెలాయిట్ ఇండియా ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్ భాగస్వామి మహేష్ జైసింగ్ చెప్పారు. కంపెనీలకు ఈ-ఇన్‌వాయిస్ ఒక వరం లాంటిది. ఎందుకంటే దీనివల్ల క్రెడిట్ సమస్యల చుట్టూ ఉన్న గందరగోళాన్ని తగ్గిస్తాయని ఆయన పేర్కొన్నారు.



Next Story

Most Viewed