- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉంటే ఈ-ఇన్వాయిస్ తప్పనిసరి!
by Disha Web Desk 17 |
X
న్యూఢిల్లీ: జీఎస్టీ నిబంధనలకు సంబంధించి కేంద్రం కీలక మార్పులు చేసింది. రూ. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్థలు ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి బిజినెస్-టూ-బిజినెస్(బీ2బీ) లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ లేదా ఈ-ఇన్వాయిస్ని రూపొందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ. 10 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న సంస్థలకు ఈ నిబంధన అమల్లో ఉంది. కేంద్రం ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ద్వారా ఈ-ఇన్వాయిస్ నమోదు పరిమితిని తగ్గింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ-ఇన్వాయిస్ల కిందకు వచ్చే ఎంఎస్ఎంఈ సంస్థల పరిది విస్తరించబడుతుందని డెలాయిట్ ఇండియా ఇన్డైరెక్ట్ ట్యాక్స్ భాగస్వామి మహేష్ జైసింగ్ చెప్పారు. కంపెనీలకు ఈ-ఇన్వాయిస్ ఒక వరం లాంటిది. ఎందుకంటే దీనివల్ల క్రెడిట్ సమస్యల చుట్టూ ఉన్న గందరగోళాన్ని తగ్గిస్తాయని ఆయన పేర్కొన్నారు.
Next Story