64% క్షీణించిన దివీస్ లేబొరేటరీస్ లాభం

by Disha Web Desk 17 |
64% క్షీణించిన దివీస్ లేబొరేటరీస్ లాభం
X

ముంబై: ఫార్మాస్యూటికల్ కంపెనీ దివీస్ లేబొరేటరీస్ శనివారం తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికర లాభం మార్చి 2023 తో ముగిసిన త్రైమాసికంలో 63.89 శాతం క్షీణించి రూ. 318.79 కోట్లకు చేరుకుంది. ఆదాయం కూడా ఏడాదికి 23.52 శాతం క్షీణించి రూ. 1,908.17 కోట్లకు చేరుకుంది. అయితే ఇది అంతకు ముందు త్రైమాసికంలో రూ. 1,689.83 కోట్ల నుంచి 12.92 శాతం పెరిగింది.

ముఖ్యంగా కంపెనీ టాప్‌లైన్ అమ్మకాల తగ్గుదల కారణంగా లాభాలు తగ్గాయి. కొవిడ్-19 ట్రీట్‌మెంట్ డ్రగ్ మోల్నుపిరవిర్ అమ్మకాలు దాదాపు సున్నాకు చేరడంతో మార్చి త్రైమాసికంలో ఆదాయం తగ్గినట్లు కంపెనీ తెలిపింది. మోల్నుపిరవిర్ అమ్మకం ద్వారా గత ఏడాది కంపెనీ $95 మిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ త్రైమాసికంలో మొత్తం ఖర్చులు ఏడాది క్రితం రూ.1,495 కోట్లతో పోలిస్తే రూ.1,550 కోట్లుగా ఉన్నాయి.

Also Read..

1946 నుంచి 2023 వరకు జరిగిన నోట్ల రద్దు వివరాలు


Next Story