- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఫేమ్2 పథకం కేటాయింపులను పెంచిన కేంద్రం
దిశ, బిజినెస్ బ్యూరో: ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్)-2 పథకం కింద వాహనాలకు ఇచ్చే రాయితీని రూ. 10,000 కోట్ల నుంచి రూ. 11,500 కోట్లకు పెంచుతూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫేమ్ పథకం కింద రెండో దశలో కేంద్రం రూ.10,000 కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి రూ. 1,500 కోట్లు పెంచింది. ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ టూ, త్రీ, ఫోర్ వీలర్ కొనుగోళ్లపై సబ్సిడీ లభిస్తుంది. ఈ పథకం ఈ ఏడాది మార్చి 31తో ముగియనుంది. ఆ తర్వాత కొనసాగింపుపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే, రెండు దశల్లో ఈ పథకం సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నయ ఇంధనం వైపు ప్రజలను మళ్లించాలంటే దీని కొనసాగింపు అవసరమని భారీ పరిశ్రమల శాఖ గతంలో కేంద్రానికి సూచించింది.