Breaking News : జియో యూజర్లకు భారీ షాక్

by M.Rajitha |
Breaking News : జియో యూజర్లకు భారీ షాక్
X

దిశ, వెబ్ డెస్క్ : రిలయన్స్ జియో(Reliance Jio) కస్టమర్లకు భారీ షాక్ తగలనుంది. పోస్ట్ పెయిడ్ ధరలు(Post Paid Prices) భారీగా పెంచుతున్నట్టు యూజర్లకు జియో షాకింగ్ ప్రకటన విడుదల చేసింది. రూ.199 ప్లాన్ పై ఏకంగా రూ.100 పెంచి.. ఇకపై రూ.299 వసూలు చేయనున్నట్టు తెలిపింది. పెంచిన ధరలు జనవరి 23 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్న జియో.. ఈ ప్లాన్ లో కస్టమర్లు ఆటోమేటిక్ గా రూ.299 కు బదిలీ అవుతారని పేర్కొంది. కాగా ఈ ప్లాన్ లో నెలకు అన్ లిమిటెడ్ కాల్స్, 25 జీబీ డేటా పొందుతారు. అయితే కొత్త కస్టమర్లు మాత్రం రూ.299కి బదులు రూ.349 తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని జియో వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed