- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Audi India: ధరలను పెంచిన ఆడి ఇండియా
by S Gopi |
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అన్ని కార్ల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది.

X
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా తన కార్ల ధరలను పెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అన్ని కార్ల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. వాహనాల తయారీలో కీలకమైన ఇన్పుట్ ఖర్చులు పెరగడం, కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని పాక్షికంగానైనా భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వివరణ ఇచ్చింది. ధరల పెంపు విధానం కారు మోడల్, వేరియంట్ను వేర్వేరుగా ఉంటుందని, కార్ల ఎక్స్-షోరూమ్ ధరలపై ఈ పెంపు అమలవుతుందని ఆడి ఇండియా డైరెక్టర్ బల్బీర్ సింగ్ దిల్లో స్పష్టం చేశారు. ఇప్పటికీ కస్టమర్లపై ఖర్చుల భారం తగ్గించేందుకు కట్టుబడి ఉంటామని ఆయన పేర్కొన్నారు.
Next Story






