- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ashok Layland: వాహనాల ధరలను 3 శాతం పెంచిన అశోక్ లేలండ్
by S Gopi |
అశోక్ లేలండ్ కొత్త ఏడాది జనవరి నుంచి అన్ని మోడళ్లపై 3 శాతం మేర ధరలను పెంచుతున్నట్టు వెల్లడించింది.

X
దిశ, బిజినెస్ బ్యూరో: హిందూజా గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అశోక్ లేలండ్ తన కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇటీవలే వాహన పరిశ్రమలో ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీలు ధరలు పెంచాయి. కమర్షియల్ విభాగంలో టాటా మోటార్స్ సైతం పెంపు నిర్ణయం తీసుకున్నాయి. ఈ జాబితాలో అశోక్ లేలండ్ సైతం కొత్త ఏడాది జనవరి నుంచి అన్ని మోడళ్లపై 3 శాతం మేర ధరలను పెంచుతున్నట్టు వెల్లడించింది. ద్రవ్యోల్బణంతో పాటు వాహనాల తయారీలో కీలకమైన వస్తువులు, కమొడిటీ ధరలు పెరగడంతో పాక్షికంగా కొంత భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. వాహన మోడల్, వేరియంట్ని బట్టి ధరల పెరుగుదలలో మార్పులు ఉంటాయి. ఈ నిర్ణయం ద్వారా ఇన్పుట్ కాస్ట్లో కొంత భారం తగ్గుతుందని కంపెనీ భావిస్తోంది.
Next Story






