బస్సు కు షాక్.. మెకానిక్ మృతి

by  |
బస్సు కు షాక్.. మెకానిక్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: మహబూబాబాద్ జిల్లా నర్సింలహులపేట మండలం గోపాతండా వద్ద విషాదం చోటు చేసుకుంది. బస్సు రిపేరు చేస్తూ కరెంట్ షాక్ తగిలి మెకానిక్ మృతి చెందాడు. ఆర్టీసీ బస్ ఆదివారం సాయంత్రంగోపాతండా వద్ద చెడిపోయింది. సోమవారం మెకానిక్ గోపాతండాకు వచ్చి బస్సును రిపేరు చేశాడు. అనంతరం బస్సును పరిశీలించేందుకు వెనుకకు ముందుకు డ్రైవ్ చేస్తున్న క్రమంలో బస్సుకు 11కెవి లైన్ వైర్లు తగిలాయి. దీంతో కరెంట్ షాక్ తగిలి బస్సులో ఉన్న మెకానిక్ ప్రాణాలు కోల్పోయాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed