ఏపీలో ఘోర ప్రమాదం.. రన్నింగ్‌ బస్సులో భారీ మంటలు..

by  |
ఏపీలో ఘోర ప్రమాదం.. రన్నింగ్‌ బస్సులో భారీ మంటలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద గురువారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్‌ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ మంటల కారణంగా బస్సు పూర్తిగా దగ్ధమైంది.

ఈ బస్సు హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రన్నింగ్‌లో ఉన్న సమయంలోనే బస్సుల్లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.



Next Story