- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తిరుపతిలో ఓ యాచకుడి ఇంట్లో రూ.10 లక్షలు బయటపడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. శేషాచల నగర్లోని అతడి నివాసంలో ట్రంకు పెట్టెల నిండా నోట్ల కట్టలు బయటపడ్డాయి. వివరాల ప్రకారం.. యాచకుడు శ్రీనివాసన్ తిరుమల కొండపైకి వచ్చే వీఐపీల వద్ద భిక్షాటన చేసేవాడు. తిరుమల నిర్వాసితుడి కేటగిరీలో అతడికి తిరుపతిలో శేషాచల నగర్లో ఇంటిని కేటాయించారు. ఇదిలా ఉండగా గత ఏడాది అనారోగ్యం కారణంగా శ్రీనివాసన్ మృతి చెందాడు.
అతడికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో శేషాచల నగర్లోని అతడి నివాసాన్ని టీటీడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఆయన ఇంట్లోకి ప్రవేశించిన టీటీడీ అధికారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. రెండు పెట్టెలు తెరిచి చూడగా, అందులో కరెన్సీ కట్టలు కనిపించాయి. వాటి విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Next Story