శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

by  |
Bullet
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పట్టణంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం రేపింది. హైదరాబాద్ నుంచి జమ్మూ-కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు వెళ్తోన్న ప్రయాణికుడి బ్యాగ్‌లో గురువారం సీఐఎస్ఎఫ్ అధికారులు బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బులెట్‌తోపాటు నిందితుడిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఎయిర్‌పోర్టులో ఈనెల 30 వరకు హైఅలెర్ట్ ఉన్న నేపథ్యంలో బులెట్ దొరకడం కలకలం రేపుతోంది.



Next Story

Most Viewed