మణిపూర్‌లో కరోనాతో జవాన్ మృతి

by  |
మణిపూర్‌లో కరోనాతో జవాన్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఈ మధ్య కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం వైరస్ నివారణకు కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ అక్కడ కేసులు అదుపులోకి రావడం లేదు.

తాజాగా కరోనా బారిన పడి బీఎస్‌ఎఫ్ జవాన్ మృతిచెందాడు. అంతకుముందే అతనికి దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, న్యుమోనియాతో పాటు కొవిడ్ సోకడంతో ప్రభుత్వ రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. ఈ విషయాన్ని వైద్య అధికారులు ధృవీకరించారు. మణిపూర్‌లో ఇప్పటికే 14మంది బీఎస్‌ఎఫ్ సిబ్బంది వైరస్ బారిన పడి మృతిచెందారు.



Next Story

Most Viewed