- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : ఆస్తి కోసం రక్త సంబంధాన్ని కాదనుకుంటున్నారు. డబ్బు కోసం దేనికైనా తెగిస్తున్నారు. అమ్మ, అన్న, చెల్లి ఇలా ఏ బంధమూ వారికి ఆస్తి ముందు ఎక్కువ కాదని దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మంగళవారం అర్ధరాత్రి ఆస్తి తగాదాల నేపథ్యంలో అన్నను కొట్టిచంపాడో తమ్ముడు. ఈ హత్యపై గోల్కొండ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఏం చెప్పారంటే..
షేక్పేటకు చెందిన విజయ్, నరేందర్ అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి షేక్పేట నాలా వద్ద ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన తమ్ముడు నరేందర్.. అన్న విజయ్ పై కర్రతో తలపై బలంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే లోపే విజయ్ మృతి చెందాడు. అన్నపై దాడి చేసిన వెంటనే నరేందర్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.