- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సవతి తల్లి కొడుకును చంపిన యువకుడు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఏడాది బాలుడిని సోదరుడు గొంతు నులిమి చంపిన ఘటన రామాయంపేట మండలం డి. ధర్మారంలో చోటు చేసుకుంది. ఆస్థి గొడవల నేపథ్యంలో కోపంతో ఉన్న యవకుడు సోమవారం మధ్యాహ్నం సవతి తల్లి కుమారుడిని గొంతు నులిమి చంపి పరారయ్యాడు. బాలుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఆస్థి గొడవలు ఉంటే తమతో మాట్లాడాలని కానీ పసివాడి ప్రాణాన్ని ఎందుకు తీయాల్సి వచ్చిందని కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు […]</p>

X
దిశ, వెబ్డెస్క్: మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఏడాది బాలుడిని సోదరుడు గొంతు నులిమి చంపిన ఘటన రామాయంపేట మండలం డి. ధర్మారంలో చోటు చేసుకుంది. ఆస్థి గొడవల నేపథ్యంలో కోపంతో ఉన్న యవకుడు సోమవారం మధ్యాహ్నం సవతి తల్లి కుమారుడిని గొంతు నులిమి చంపి పరారయ్యాడు. బాలుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఆస్థి గొడవలు ఉంటే తమతో మాట్లాడాలని కానీ పసివాడి ప్రాణాన్ని ఎందుకు తీయాల్సి వచ్చిందని కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
Next Story






