మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలోనే తీవ్ర విషాదం

by  |
మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలోనే తీవ్ర విషాదం
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లిబాజాలు మోగాల్సిన ఆ ఇంట చావు డప్పులు మోగాయి. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. వరడు మృతి చెందాడు. ఈఘటన ఆమనగల్లులో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన వరుడు నరేష్ (25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నరేష్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే వరుడి మృతికి కారణాలేంటి..? అనే విషయాలు తెలియరాలేదు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed