సీఎం కేసీఆర్ తాగిన మైకంలో అలా మాట్లాడారు.. టీఆర్‌ఎస్ నేత డీకే సంజీవ్

by Web Desk |
సీఎం కేసీఆర్ తాగిన మైకంలో అలా మాట్లాడారు.. టీఆర్‌ఎస్ నేత డీకే సంజీవ్
X

దిశ, గుడిహత్నూర్: రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్‌ఎస్ గుడిహత్నూర్ మండల ఉపాధ్యక్షుడు డీకే సంజీవ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు. రాష్ట్రంలో కేవలం 1శాతం ఉన్న వర్గం పాలిస్తుందంటే అది రాజ్యాంగం వల్లే అని తెలిపారు. తాగిన మైకంలో నోటికి వచ్చింది మాట్లాడి దళితులను మోసం చేశారని అన్నారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.




Next Story