పరిపాలనపై ప్రభుత్వం ఫోకస్ చేయడం లేదు : మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
పరిపాలనపై ప్రభుత్వం ఫోకస్ చేయడం లేదు : మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : పరిపాలనపై ప్రభుత్వం ఫోకస్ చేయడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నీళ్ల పంపకాలు, వాడుకపై ప్రభుత్వం దృష్టి పెట్లాలని అన్నారు. తమకున్న సమాచారం ప్రకారం.. కృష్ణా బోర్డు ఏపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయని తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టులు కూడా కేఆర్ఎంబీ పరిధిలోకి వెళాతయాని తెలుస్తోందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ తమకు అప్పగించాలని గతంలోనూ ఏపీ, కేంద్ర జల వనరుల శాఖ ఒత్తిడి తెచ్చిదంటూ గుర్తు చేశారు. ఆయా అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలని మాజీ మంత్రి స్పష్టం చేశారు.

Next Story

Most Viewed