- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య.. కీలకంగా మారిని సూసైడ్ నోట్..
దిశ, వెబ్డెస్క్: 25 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ 11వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఘజియాబాద్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ నంద్ గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్నగర్లో ఆయుషి అనే ఫ్యాషన్ డిజైనర్ తల్లిదండ్రులతో కలసి గత రెండు సంవత్సరాలుగా నివసిస్తోంది. కాగా, ఆయుషి సోమవారం రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి.. రాత్రి 8గంటల సమయంలో 11వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు మృతురాలి తల్లికి విషయం చెప్పాగా.. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఒకటిన్నర పేజీల సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ లేఖలో ఆయుషి తండ్రితో వివాదాలు ఉన్నాయని.. ఫ్యాషన్ డిజైనింగ్లో సరిగ్గా రాణించలేకపోతున్నానని పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. చేతి రాత నిపుణులు లేఖను పరిశీలిస్తు్న్నట్లు పోలీసులు తెలిపారు.