- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కామారెడ్డి : కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్నాయి. రోజు వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో సోమవారం వెయ్యికి పైగా కేసులు నమోదు కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో కరోనా వివరాలను అధికారులు బహిర్గతం చేయడానికి ఇష్టపడటం లేదు. ప్రతి రోజు జిల్లా అధికారులు వివరాలు ఇవ్వకున్నా మెడికల్ ఆఫీసర్ల ద్వారా మీడియా వివరాలు సేకరించేది. అలాంటిది సోమవారం పలువురు మెడికల్ ఆఫీసర్లకు ఫోన్ చేసి కరోనా వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించగా మీడియాకు వివరాలు ఇవ్వకూడదని తమకు ఆదేశాలు ఉన్నాయని, జిల్లా అధికారుల ద్వారానే వివరాలు తీసుకోవాలని వారు తెలిపారు. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారిని కరోనా పాజిటివ్ కేసుల వివరాల కోసం సంప్రదించగా ఆయన నుంచి స్పందన కరువైంది. జిల్లా వివరాలు ఇవ్వలేమని, కేవలం స్టేట్ బులిటీన్ మాత్రమే విడుదల అవుతుందని చెప్పడం గమనార్హం.
ప్రస్తుతం స్టేట్ బులిటీన్ అసలైన వివరాలు వెల్లడిస్తుందన్న నమ్మకం లేదు. ఇప్పటికే జిల్లా వివరాలు, స్టేట్ బులిటీన్ కు చాలా తేడాలు కనిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు కేసుల సంఖ్య తక్కువ చేసి చూపిస్తే ప్రజలు కేసుల తీవ్రత తక్కువ ఉందని విచ్చలవిడిగా బయట తిరిగి కరోనా బారిన పడే ప్రమాదం ఉంది. కరోనా కేసుల వివరాలను మీడియాకు ఇవ్వకుండా ఉండటం వల్ల కేసుల సంఖ్యను దాచుతారేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. కరోనా వివరాలు బయటకు రాకుండా అధికారులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారో తెలియాల్సి ఉంది.