పండుగ ఆఫర్లను ప్రకటించిన బ్రాండ్ ఫ్యాక్టరీ

by  |
పండుగ ఆఫర్లను ప్రకటించిన బ్రాండ్ ఫ్యాక్టరీ
X

దిశ, వెబ్‌డెస్క్: పండుగ సీజన్ సందర్భంగా ఫ్యూచర్‌గ్రూప్‌ స్టోర్స్‌ బ్రాండ్‌ ఫ్యాక్టరీ టాప్ బ్రాండ్లకు చెందిన సరికొత్త ఫ్యాషన్ స్టైల్ కలెక్షన్‌ను ప్రవేశపెట్టింది. అతి తక్కువ ధరలతో పాటు అద్భుతమైన ఆఫర్లను అందించనున్నట్టు బ్రాండ్ ఫ్యాక్టరీ వెల్లడించింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని బ్రాండ్ ఫ్యాక్టరీ స్టోర్లలో పరిశుభ్రత వాతావరణాన్ని కల్పిస్తూ, వినియోగదారులు సురక్షితమైన షాపింగ్ చేసుకునే అనుభవాన్ని ఇవ్వనున్నట్టు గురువారం బ్రాండ్ ఫ్యాక్టరీ ఓ ప్రకటనలో తెలిపింది.

లీ కూపర్, బఫెలొ, జాన్ మిల్లర్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఫ్యాషన్ దుస్తులను అందుబాటులోకి తెచ్చామని, పండుగల సందర్భంగా ప్రత్యేక డిజైన్ దుస్తులతో ఎథ్నిక్ వేర్‌ను, ఇంకా ఇతర ఫ్యాషన్ దుస్తులను అందుబాటులో ఉంచినట్టు కంపెనీ పేర్కొంది. అలాగే, పండుగ సీజన్‌లో వినియోగదారులను ఆకట్టుకునేందుకు 2 కొంటే 3 ఉచితం పేరుతో అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. అదనంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో అదనంగా 5 శాతం తక్షణ డిస్కౌంట్‌తో పాటు షాపింగ్ తర్వాత రూ. 500 విలువైన గిఫ్ట్ ఓచర్లను, ప్రముఖ బ్యాంకులకు చెనిన క్రెడిట్ కార్డులపై ‘నో కాస్ట్ ఈఎంఐ’ ఆఫర్లను అందిస్తోంది.

ఈ సందర్భంగా మాట్లాడిన బ్రాండ్ ఫ్యాక్టరీ సీఈవో సురేష్ సద్వాని..లాక్‌డౌన్ తర్వాత పండుగ సీజన్ కోసం తాము ప్రవేశపెట్టిన ‘ది బిగ్గెస్ట్ ఫ్యాషన్ అన్‌లాక్’ సేల్‌కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అన్‌లాక్ దశలో తాము అందించే ప్రత్యేక ఆఫర్లను ఎంచుకోవడం ద్వారా కస్టమర్లు ఎక్కువ ప్రయోజనాలను పొందనున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేక ఆఫర్లను మరింత కాలం కొనసాగించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.



Next Story

Most Viewed