ఆడుకునేందుకు వెళ్లి తిరిగిరానిలోకాలకు..

by  |
ఆడుకునేందుకు వెళ్లి తిరిగిరానిలోకాలకు..
X

దిశ, వెబ్‌డెస్క్ : సరదాగా ఆడుకుందామని బయటకు వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు. నిన్న మధ్యాహ్నం వెళ్లిన తమ కొడుకుద ఇంకా ఇంటికి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల అంతా వెతికారు. తెలిసిన వాళ్ల ఇళ్లలో ఆరా తీశారు. అయినా ఫలితం లేకపోయింది. తీరా చూస్తే శుక్రవారం తెల్లవారు జామున ఇంటి ముందు ఉన్న మురుగు కాలువలో నిషాంత్ మృతదేహం లభ్యమైంది.

ఈ విషాదకరమైన ఘటన కామారెడ్డి జిల్లాలోని దేవునిపల్లిలో వెలుగుచూసింది. తమ కొడుకు మరణవార్త విని బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంక్రాంతి పండుగ అందరి ఇళ్లలో సంతోషాన్ని నింపితే, తమ ఇంట్లో విషాదాన్ని తీసుకొచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.



Next Story