నేడు గోల్కొండ బోనాలు

by  |
నేడు గోల్కొండ బోనాలు
X

దిశ, వెబ్‌డెస్క్‌: ప్రతి ఏడాది ప్రభుత్వం ఎంతో వైభవంగా నిర్వహించే గోల్కొండ బోనాలు నేడు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతుండటంతో భక్తులందరూ ఇంటి దగ్గరే బోనాలు సమర్పించుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు. అంతేకాకుండా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి అమ్మవారి బోనాలకు కూడా నేడు అంకురార్పణ చేయనున్నారు. కరోనా దృష్ట్యా ఆలయంలో ఎదుర్కోలు వేడుక, ఊరేగింపులో భక్తులకు అనుమతి ఇవ్వడం లేదని ఆలయ ఈవో అన్నపూర్ణ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను అందరూ అర్ధం చేసుకోవాలని వేడుకున్నారు.

Next Story