బాంబులపై కాలు పెట్టాడు.. తీరా చూస్తే..!

by  |
బాంబులపై కాలు పెట్టాడు.. తీరా చూస్తే..!
X

దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని కాట్రపల్లి గ్రామ శివారులో ఎర్రమ్మ గుడి వద్ద బాంబులు కలకలం రేపాయి. జాతర కోసం గుడిని శుభ్రం చేస్తుండగా మూడు మందు పాతరలను గ్రామస్థులు గుర్తించారు. వివారాల్లోకి వెళ్ళితే.. కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామ శివారులో ఎర్రమ్మగుడి వద్ద మరో రెండు రోజుల్లో పద్మశాలి కులస్తులు జాతర నిర్వహించుకోనున్నారు. ఈ క్రమంలో మంగళవారం కులపెద్దలు స్థలం శుభ్రం చేస్తుండగా అందులో ఒక్కరి కాలు మందుపాతరలు ఉన్న గుంతలో ఇరుక్కుంది. దీనిని గమనించిన స్థానికులు మూడు చోట్ల మందుపాతరలు గుర్తించి పోలీసులుకు సమాచారం అందించారు.

పక్కరాష్ట్రంలోనే మావోయిస్టులు, జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ గుడి సమీపంలోనే ఓ గ్రానైట్ క్వారీ ఉండగా క్వారీ పేలుళ్లు కోసం బాంబులు పెట్టారా..? లేక ఇంకా ఏదైనా పేలుళ్ల సృషించడానికా..? అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. లభ్యమైన పేలుడు పదార్థాల్లో 85 గిలెటిన్ స్టిక్స్, 22 భూస్టర్స్, 4 సేఫ్టీ డిటోనేటర్స్, 8 డిటోనేటర్స్, వైర్లను స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్సై యాసిన్ తెలిపారు.



Next Story

Most Viewed