బీజేపీ అభ్యర్థి కారుపై బాంబు దాడి..

by  |
బీజేపీ అభ్యర్థి కారుపై బాంబు దాడి..
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి కారుపై బాంబుదాడి జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. వివరాల ప్రకారం.. ఉత్తర 24 పరగణాల జిల్లా, ఖార్దా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న శిల్భద్ర దత్త.. రోడ్డుపై నిల్చుని టీ తాగుతున్న సమయంలో కారుపై నాటు బాంబు దాడి జరిగింది. కారు ఆపి సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బాంబు దాడి పాల్పడ్డాడు. అయితే ఈ దాడి వెనుక తృణమూల్​కాంగ్రెస్​ కుట్ర ఉందని.. దీనిపై తాను ఎలక్షన్​ కమిటీ(ఈసీ)కి ఫిర్యాదు చేస్తానని దత్త తెలిపారుర. బాంబు దాడి వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story