ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం

by  |
ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం
X

సికింద్రాబాద్-విజయవాడ వెళ్లే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందంటూ.. బెదిరింపు కాల్ కలకలం రేపింది. రైలులో బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు వెంటనే రైలును నిలిపివేశారు. విషయం తెలిసిన ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. దాదాపు గంటపాటు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో అధికారులు తనిఖీలు చేపట్టారు. అయినా, ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదు. అనంతరం రైలు విజయవాడకు బయలుదేరింది.s

Next Story

Most Viewed