టాకీస్‌లో మూవీ చూసేందుకు వెళ్తున్నా : అమీర్

by  |
టాకీస్‌లో మూవీ చూసేందుకు వెళ్తున్నా : అమీర్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్స్‌ అన్నీ వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే పర్మిషన్స్ ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ చిత్రీకరణలు మొదలవుతున్నాయి. అయితే మనోజ్ బాజ్‌పాయ్, దిల్జిత్ దోసంజ్, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘సూరజ్ పే మంగల్ భారి’ (Suraj Pe Mangal Bhari) చిత్ర షూటింగ్‌‌ సైతం కరోనా ఎఫెక్ట్‌తో అప్పట్లో వాయిదా పడింది. కాగా కొవిడ్ పరిస్థితులు చక్కబడ్డాక మిగిలిన షూటింగ్‌ను ఇటీవలే కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆదివారం రిలీజ్ అయింది.

మహారాష్ట్రలో కొవిడ్ రూల్స్ పాటిస్తూ 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకునేందుకు అక్కడి సర్కారు అనుమతిచ్చింది. దీంతో ‘సూరజ్ పే మంగల్ భారి’ సినిమా దివాళీ కానుకగా టాకీస్‌ల్లో(మల్టిప్లెక్స్) విడుదలైంది. కాగా, ఈ చిత్రాన్ని టాకీస్‌లో చూసేందుకు వెళ్తున్నాని, చాలా రోజుల తర్వాత వెండి తెరపై సినిమా ప్రదర్శనను ఎక్స్‌పీరియెన్స్ చేయనున్నట్లు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం అమీర్ ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మక్కళ్ సెళ్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Next Story

Most Viewed