కేటీఆర్ బర్త్ డే.. ఇండియా బుక్ రికార్డ్స్‌లో చోటు

by  |
కేటీఆర్ బర్త్ డే.. ఇండియా బుక్ రికార్డ్స్‌లో చోటు
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు రాష్ర్ట వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు ఒకే రోజులో అత్యధికంగా రక్త దానాలు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా.. దాదాపు 2 వేల మంది టీఆర్ఎస్ శ్రేణులు రక్తదానం చేశారు. ఇంత పెద్ద ఎత్తున రక్తదానం చేయడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. గతంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో 867 మంది ఒకేరోజు రక్త దాన రికార్డు ఇప్పుడు బద్దలైంది. ఈ మెగా రక్తదాన శిబిరానికి హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పువ్వాడ అజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed