ఉప్పల్‌లో రక్తదాన శిబిరం

by  |
ఉప్పల్‌లో రక్తదాన శిబిరం
X

దిశ, మేడ్చల్: రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో రక్తదానం చేయడానికి నగరవాసులు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఉప్పల్ పరిధిలోని శ్రీనివాస హిల్స్​ వాసులు సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. రెడ్​క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 85 మంది యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని ఈ శిబిరాన్ని ప్రారంభించిన ఉప్పల్ ఎస్సై రంగస్వామి పిలుపునిచ్చారు.

Tags: blood donation, uppal, medchal, SI rangaswamy, srinivasa hills, red cros,

Next Story

Most Viewed