భయంతో పరుగులు తీసిన రైతులు.. అక్కడే ఉన్న యువకుడు ఏం చేశాడంటే ?

by  |
భయంతో పరుగులు తీసిన రైతులు.. అక్కడే ఉన్న యువకుడు ఏం చేశాడంటే ?
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని రైతులు రోజు పంట పొలాలకు వెళ్తూ ఉంటారు. ఈక్రమంలో శనివారం మండలంలోని ఓ వరిపొలంలో రైతులు వరి కొస్తుండగా భయంకరమైన రక్తపింజర పాములు కనిపించాయి. దీంతో రైతులు పాములను చూసి భయంతో పరుగులు తీశారని కొందరి రైతుల విశ్వసనీయ సమాచారం. అయితే రైతులు ఎందుకు పరుగులు తీస్తున్నారని పక్క పొలంలో ఉన్న యువకుడు గమనించాడు. ఈ తరుణంలో అక్కడికి వెళ్లి ఏంటని చూడాగా వరి పొలంలో రెండు రక్తపింజర పాములు యువకుడికి కనిపించాయి. దీంతో వెంటనే పక్కనే ఉన్న గొడ్డలితో రెండు పాములను హతమార్చాడు.


Next Story

Most Viewed