- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తిరుపతిలో రైల్ పట్టాలపై పేలుడు ఘటన స్థానికంగా కలకలం రేపింది. రేణిగుంట మండలం తారకరామానగర్లోని రైల్వే ట్రాక్ ఈ పేలుడు సంభవించింది. పట్టాలపై ఏదో డబ్బ అనుమానాస్పదంగా కనిపించడంతో అటుగా వెళ్తున్న పశువుల కాపరి డబ్బాను కదిలించారు. దీంతో ఒక్క సారిగా పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. కుడికాలి భాగం నుజ్జు నుజ్జు అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అయితే, రైల్వే పట్టాలపై పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయో అన్న సంగతి అంతుచిక్కకుండా మారింది. దీని వెనుక ఎవరైనా భారీ కుట్రకు ప్లాన్ చేశారా అన్న అనుమానం స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story