శివకాశి బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు

by  |
శివకాశి బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులోని శివకాశి బాణాసంచా ఫ్యాక్టరీలో మరోసారి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద 20 మంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed