తెలంగాణలో ‘బ్లాక్ ఫంగస్’ కలకలం..

by  |
తెలంగాణలో ‘బ్లాక్ ఫంగస్’ కలకలం..
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ వైరస్ కొత్తగా కలకలం రేపుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తుంటే కొత్తగా బ్లాక్ ఫంగస్ వెలుగులోకి రావడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా బాధితుల్లో ఐదుగురికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. గురువారం బైంసాలో ఒకరు ఈ ఫంగస్ లక్షణాలతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో నలుగురు రోగులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో బ్లాక్ ఫంగస్ బాధితులు బయటపడిన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed