మందుబాబులకు అడ్డాగా మారిన ప్రభుత్వ స్కూల్

by  |
మందుబాబులకు అడ్డాగా మారిన ప్రభుత్వ స్కూల్
X

దిశ, సిద్దిపేట: అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రభుత్వ స్కూల్ మందుబాబులకు అడ్డాగా మారిందని బీజేవైఎం జిల్లా నాయకుడు కర్ణకంటి నరేష్ అన్నారు. మంగళవారం పాఠశాలను సందర్శించిన ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజా ప్రతినిధులు పాఠశాలను పట్టించుకోకపోవడంతో మందుబాబులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ స్కూలు తలుపులను, కిటికీలను పగలగొట్టి మద్యం సేవిస్తున్నారని ఆరోపించారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే మందుబాబులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారన్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి మందుబాబులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



Next Story