ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎదుట బీజేవైయం ధర్నా

by Shyam |   (  Updated:2021-07-18 06:28:39  IST  )

<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఆర్మూర్‌లోని మామిడిపల్లికి చెందిన ఇద్దరు మైనర్ అమ్మాయిల అదృశ్యం కేసులో పోలీసులు దర్యాప్తు చేయడం లేదని నిజ నిజాలను దాస్తున్నారని బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అదివారం బీజేవైయం రాష్ట్ర కార్యదర్శి పటేల్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ముందు బీజేవైయం నాయకులు  నిరసన వ్యక్తం చేశారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా బైఠాయించారు. ఇద్దరు మైనర్ లు కిడ్నాప్ అయ్యారని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా [&hellip;]</p>

BJYM protest
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఆర్మూర్‌లోని మామిడిపల్లికి చెందిన ఇద్దరు మైనర్ అమ్మాయిల అదృశ్యం కేసులో పోలీసులు దర్యాప్తు చేయడం లేదని నిజ నిజాలను దాస్తున్నారని బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అదివారం బీజేవైయం రాష్ట్ర కార్యదర్శి పటేల్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ముందు బీజేవైయం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా బైఠాయించారు.

ఇద్దరు మైనర్ లు కిడ్నాప్ అయ్యారని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా పోలీస్ శాఖ ఈ కేసును సీరియస్ గా తీసుకోవడం లేదని పటేల్ ప్రసాద్ ఆరోపించారు. మైనర్ అమ్మాయిలకు ఏదైన హనీ జరిగితే ఉరుకునేది లేదని హెచ్చరించారు. అమ్మాయిల అదృశ్యం కేసును 48 గంటల్లో చేధిస్తామని విచారణ జరుగుతుందని పోలీసులు హమీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

Next Story