చర్చకు మేము సిద్దం….

by  |
చర్చకు మేము సిద్దం….
X

దిశ ప్రతినిధి, కరీంనగర్:
కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చించేందుకు బీజేపీ సిద్దంగా ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆవాసయోజన, కృషి యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులను ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్నభోజనం, రేషన్ బియ్యం, ఇలా ప్రతి అంశాల్లో వెచ్చిస్తున్న నిధులు ఎవరివో చర్చిద్దామా అని ప్రశ్నించారు. వైకుంఠ ధామాలకు కేంద్రం కేటాయిస్తున్న నిధుల గురించి, ప్రతి అంశంలోనూ కేంద్రం వాటా ఏంటో చెప్పేందుకు తాను సిద్ధమని ఆయన తెలిపారు. దీనికి హరీశ్ రావు సిద్ధమా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఒక ఎకరాకు నీళ్ళు ఇస్తే ఎంత ఖర్చు అవుతుందో హరీశ్ రావు చెప్పాలని యెండల డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల్లో 10 వేల ట్రాక్టర్లు కొంటె అందులో ఎక్కువశాతం మహేంద్ర ట్రాక్టర్లు ఎందుకు ఉన్నాయో హరీశ్ రావు వివరించాలన్నారు. మంత్రి హరీశ్ సవాళ్లు విసిరారనీ, చర్చకు రావాలని హరీశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తాను ప్రతిసవాల్ విసురుతున్నానని అన్నారు.


Next Story

Most Viewed