వైభవంగా దుర్గామాత నిమజ్జనం.. పాల్గొన్న బండి సంజయ్

by  |
MP Bandi Sanjay
X

దిశ, కరీంనగర్ సిటీ: నవరాత్రులు పూజలందుకుని, మరో ఏడాది దాకా మీకు అండగా ఉంటానని అభయమిచ్చి, తనను నమ్ముకున్న వారికి విజయాలు కలగాలని ఆశీర్వదించి, తన సోదరి గంగమ్మ చెంతకు పయనమైన దుర్గమ్మ తల్లికి శనివారం భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. పలు డివిజన్లలో ఏర్పాటు చేసిన దుర్గామాత నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచే భక్తులు మంటపాలను పెద్ద ఎత్తున సందర్శించి, పూజలు నిర్వహించారు. అనంతరం అందంగా తీర్చిదిద్దిన వాహనాల్లో డప్పు చప్పుళ్ళు, మహిళల కోలాటాలు, యువకుల ఆటపాటల మధ్య మానకొండూర్ చెరువుకు తరలించి, నిమజ్జనం చేశారు.

నగరంలోని టవర్ సర్కిల్, శాస్త్రీ రోడ్డు, పాత బజార్, మెహర్ నగర్‌లలో ఏర్పాటు చేసిన దుర్గామాత మంటపాలను శనివారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వేడుకున్నట్లు తెలిపారు. నవరాత్రులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన నిర్వాహకులను ఎంపీ బండి సంజయ్ కుమార్ అభినందించారు. ఆయన వెంట బీజేపీ నగర సెంట్రల్ జోన్ అధ్యక్షుడు, కార్పొరేటర్ దురిశెట్టి అనుప్, బండ సుమ రమణారెడ్డి,వరాల జ్యోతి, పాదం శివరాజ్, మోహన్,బిజెపి నాయకులు లడ్డు ముoదడ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed