కేసీఆర్‌కు RRR మూవీ చూపించాలన్న బండి సంజయ్..

by  |
కేసీఆర్‌కు RRR మూవీ చూపించాలన్న బండి సంజయ్..
X

దిశ, కమలాపూర్ : హుజురాబాద్ ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్, శనిగరం, కమలాపూర్ మండల కేంద్రాల్లో శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఈటలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బండి సంజయ్ ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు.

కరోనా సమయంలో ఈటల చేసిన సేవలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, పేదల పక్షాన ప్రశ్నిస్తున్నాడని కావాలనే కేసీఆర్ ఈటలను బయటకు పంపించాడని ఆరోపించారు. కేంద్రం పెట్రోల్ ధర పెంచిందని టీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక లీటర్ పెట్రోల్ పై రూ.41 వసూలు చేస్తుందని, ఆ డబ్బులు ప్రభుత్వం వదులుకుంటే రాష్ట్రంలో పెట్రోల్ ధర 65 రూపాయలు ఉంటుందన్నారు.

బీజేపీ దళిత బంధువు పథకాన్ని ఆపి వేయించినదని ఆరోపిస్తున్నారని.. సీఎం కేసీఆరే ఎన్నికల కమిషన్ పేరుతో దళితులను మోసం చేశాడని ఆరోపించారు. రైతు పొలంలో ఏ పంట పండించాలో నిర్ణయించేందుకు నువ్వు ఎవరివి అని కేసీఆర్ పై మండిపడ్డారు. ఈటల రాజేందర్ నిజాయితీగా వ్యాపారం చేసి పెద్దోడు అయిండని, కేసీఆర్ మాత్రం బ్రోకర్ దందా చేసి పాస్ పోర్టులు ముద్ర కొట్టి పెద్దోడు అయ్యాడన్నారు. కేసీఆర్ కన్నా పెద్ద అవినీతి పరుడు లేడని ఆరోపించారు. 30వ తేదీన నియోజకవర్గ ప్రజలందరూ సకుటుంబ సపరివారంగా వెళ్లి బీజేపీ పార్టీ పువ్వు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల 2వ తేదీన ప్రగతి భవన్లో ప్రొజెక్టర్ ద్వారా కేసీఆర్‌కు RRR సినిమా చూపించాలన్నారు. ఈనెల దీపావళి ఎన్నికల రిజల్ట్స్ ద్వారా రెండవ తేదీన వస్తుందని, అందరూ తమ సెల్ఫోన్లో టార్చ్ లైట్ ఆన్‌చేసి ఈటలకు మద్దతు తెలపాలని కోరగా, అనంతరం ప్రజానీకమంతా తమ సెల్ఫోన్ల ద్వారా టార్చ్‌లైట్ ఆన్ చేసి ఈటలకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు విజయ రామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, వెంకటేశ్వరరావు, నందీశ్వర్, మునిధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు రాకేష్ రెడ్డి జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed