తెలంగాణలో కరోనాతో బీజేపీ సీనియర్ నాయకుడు మృతి

by  |
తెలంగాణలో కరోనాతో బీజేపీ సీనియర్ నాయకుడు మృతి
X

దిశ, ముషీరాబాద్ : బీజేపీ సీనియర్ నాయకులు, అడిక్‌మెట్ డివిజన్ కార్పొరేటర్ సునీత గౌడ్ భర్త సి.ప్రకాష్ గౌడ్ ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన ఆకస్మిక మరణం నియోజక వర్గం ప్రజలను, పలు పార్టీల నాయకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. రెండు రోజుల క్రితం కార్పొరేటర్ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన అదే రోజు సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు.

దీంతో ఆసుపత్రిలో చేరిన ఆయన పరీక్షలు చేయించుకున్నారు. కాగా ఆయనకు కరోనా పాజిటివ్ అని 9వ తేదీ సాయంత్రం తెలిసింది. దీంతో హైటెన్షన్‌కు గురైన ప్రకాష్ గౌడ్‌ను‌ ఐసీయయూకి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రకాష్ గౌడ్ మృతదేహాన్ని రామ్ నగర్ లోని ఆయన నివాసానికి తీసుకువచ్చి.. అనంతరం పార్శిగుట్ట స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రకాష్ గౌడ్ మరణ వార్త తెలుసుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, పలు పార్టీల నాయకులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed