వ్యవసాయ చట్టంపై కేసీఆర్‌కు అవగాహన లేదు

by  |
వ్యవసాయ చట్టంపై కేసీఆర్‌కు అవగాహన లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కొత్త వ్యవసాయ చట్టంపై కేసీఆర్‌కు అవగాహన లేదని విమర్శించారు. కేంద్ర వ్యవసాయ బిల్లులను రైతులు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. తమ పంటకు ధర నిర్ణయించుకునే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం రైతులకే కల్పించిందని, రైతులతో ముందస్తు ఒప్పందం కేవలం పంట కాలనీకే పరిమితం అవుతుందని స్పష్టం చేశారు. పంట సాగుకు ముందే ధరను నిర్ణయించుకుంటే తప్పేమిటీ అని.. ఈ విషయంలో కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.

Next Story