బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రకటన..

by  |
బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రకటన..
X

దిశ, వెబ్‌డెస్క్ :

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ఆయన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. అందులో 8 మంది ప్రధాన కార్యదర్శులు, 13మంది జాతీయ కార్యదర్శులతో కూడిన జాబితాను శనివారం సాయంత్రం విడుదల చేశారు.

ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులకు చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వరించగా, తెలంగాణకు చెందిన మరో సీనియర్ నాయకురాలు డికే అరుణకు కార్యవర్గంలో ఉపాధ్యక్షురాలిగా చోటు దక్కింది.

అదే విధంగా జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ చోటు దక్కించుకోగా, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా డాక్టర్ కె లక్ష్మణ్ నియమితులయ్యారు. అయితే, కొత్త కార్యవర్గంలో మురళీధర్ రావు, రాంమాధవ్‌కు భంగపాటు ఎదురైంది.


Next Story

Most Viewed