బిపిన్ రావత్ మృతిపై బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by  |
BJP MP Subramanian Swamy
X

దిశ, వెబ్‌డెస్క్: భార‌త‌ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్‌ రావత్‌ ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. హెలికాప్టర్‌ చెట్టుకు ఢీకొనడం, ఆతర్వాత మంటలు చేలరేగడంతో మొత్తం 13 మంది మృత్యువాత పడ్డారు. అయితే, తాజాగా.. ఈ ప్రమాదంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రివిద దళాల అధిపతి బిపిన్ రావత్ మరణంపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రావత్, ఆయన భార్య, ఇతర సీనియర్ ఆర్మీ అధికారుల మరణాలపై అనేక సందేహాలు ఉన్నాయని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి లాంటి బయటి వ్యక్తితో సమగ్ర విచారణ జరిపించాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed