- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మట్లాడుతూ… ఏపీకి నాలుగు గ్రహణాలు పట్టాయని తెలిపారు. కరప్షన్, క్యాస్ట్, కుటుంబం, కుహనా రాజకీయాల నుంచి ఏపీని తప్పించాలంటే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరం జీవీఎల్ అభిప్రాయపడ్డారు. రెండు ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక ఏపీ అభివృద్ధి కుంటుపడిందన్నారు. గతంలో జరిగిన అవినీతి వెలికితీయడంలో ప్రస్తుత ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఎద్దేవా చేశారు. అవినీతి జరిగిందని తెలిసినా, ఎవరిపైనా చర్యలు లేవంటే టీడీపీతో వైసీపీ లాలూచీ పడిందేమోనన్న అనుమానం వస్తోందన్నారు. కుటుంబ రాజకీయాలకు ప్రజలు స్వస్తి పలకాలని తెలిపారు.
Next Story