మేము గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైకే : బండి

by  |
మేము గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైకే : బండి
X

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము గెలిస్తే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. పాతబస్తీలో ఉంటున్న సుమారు 40వేల మంది రోహింగ్య, పాకిస్థాన్ ముస్లింలు ఎంఐఎంకు ఓట్లు వేస్తున్నారని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, ఎంఐఎం పార్టీ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా సపోర్టు చేస్తుందని విమర్శించారు.

అంతకుముందు, పాతబస్తీలో రోహింగ్యా ముస్లిములు ఉంటే కేంద్రహోంమంత్రి అమిత్ షా ఎందుకు అడ్డుకోలేదని ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌గా మంగళవారం బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంటే మొదటి సర్జికల్ స్టైక్ పాతబస్తీలోనే జరుగుతుందన్నారు. ప్రస్తుతం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.



Next Story

Most Viewed