అవినీతి పాలనను అంతమొందించాలి: ఎంపీ అర్వింద్

by  |
అవినీతి పాలనను అంతమొందించాలి: ఎంపీ అర్వింద్
X

దిశ, ముషీరాబాద్: టీఆర్ఎస్ అవినీతి పాలనను అంతమొందించాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పిలుపునిచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్ డివిజన్ అభ్యర్థి పావని వినయ్ కుమార్‌కు మద్దతుగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎన్నికల ఇంఛార్జ్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి డివిజన్‌లో రోడ్ షోను ఆదివారం నిర్వహించారు.

చిక్కడపల్లి మున్సిపల్ మార్కెట్ నుంచి ప్రారంభమైన రోడ్ షో బాపు నగర్, ఈ సేవా కేంద్రం, వివేక్ నగర్, సిటీ సెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, జవహర్ నగర్, అశోక్ నగర్ చౌరస్తా మీదుగా అరుంధతి నగర్, సబర్మతి నగర్, వి.వి.గిరి నగర్, దోబీ ఘాట్ బస్తీలలో సాగింది. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ… డిసెంబర్ 1న జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి పావని వినయ్ కుమార్‌ను గెలిపించాలని కోరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు వేసే ప్రతి ఓటూ తెలంగాణ రాష్ట్రంలో మోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు తోడ్పడుతుందని అన్నారు. ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సినీనటి మాధవి లత, మాజీ కార్పొరేటర్ శైలజా గోపాల్, పద్మజా ఫుల్ రామ్ రెడ్డి, అరుణ జయేందర్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed