ఓట్లు మాకు..దోశలు మీకు

by  |
ఓట్లు మాకు..దోశలు మీకు
X

దిశ, వెబ్ డెస్క్ : ఓటు కోసం కోటి తిప్పలు అంటే ఇవేనేమో ..ఎమెల్సీ ఎన్నికలు సమీపిస్తుండడంతో నాయకులు ఓట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ బీజేపీ ఎమెల్సీ అభ్యర్థి రాంచందర్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓయుకు వెళ్లారు. అక్కడ విద్యార్థులను ఆకట్టుకునేందుకు చెట్టుకింద ఉన్న దోశల బండి వద్దకు వెళ్లి తానే స్వయంగా దోశలు వేశారు. మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేయాలని విద్యార్థలకు, పట్టభద్రులకు రాంచందర్ రావు విజ్ఞప్తి చేశారు.



Next Story