ఆ లీడర్ పెత్తనం దుబ్బాకలో అవసరమా?

by  |
ఆ లీడర్ పెత్తనం దుబ్బాకలో అవసరమా?
X

దిశ, దుబ్బాక : సిద్దిపేట నుంచి వచ్చి దుబ్బాకలో ఎందుకు పెత్తనం చేస్తున్నావని మంత్రి హరీశ్ రావుపై రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. దుబ్బాకలో బీజేపీ పార్టీకి లీడర్లు లేక వేరే నియోజకవర్గాల లీడర్లను తెప్పిచ్చుకొని ప్రచారం చేస్తున్నారన్న మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. ఆ విషయానికొస్తే టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక నియోజకవర్గంలో లీడర్లు గతిలేక పక్క నియోజకవర్గం నుంచి హరీశ్ రావు వచ్చాడనీ అన్నారు. తన స్వంత నియోజకవర్గం దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామమని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట, చెల్లాపూర్ గ్రామాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డితో కలిసి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ… దుబ్బాకను మోసం చేయడానికి హరీశ్ రావు కంకణం కట్టుకున్నాడని తెలిపారు. ఎన్నికల కోడ్ పడుతుందని ఆగమాగం వచ్చి దుబ్బాక నియోజకవర్గంలో కుల సంఘాలను పిలపించుకున్నాడనీ అన్నారు. దుబ్బాక పై సిద్దిపేట లీడర్లు అధికారం చేయద్దంటే, మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలంటే పువ్వు గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

Next Story